పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు..అక్కడ..ఇక్కడ అంటూ !

-

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు X లో మరోసారి సెటైర్లు వేశారు. కిషన్ రెడ్డి, చంద్రబాబుతో ఆయన దిగిన ఫోటోలను షేర్ చేస్తూ….”విలువలు లేని తమకే ఇది సాధ్యం” అని కామెంట్ చేశారు. ఎన్డిఏలో ఉంటూ చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవడం, ఏపీ బీజేపీని పట్టించుకోకుండా తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేయడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా…జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి.. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై చర్చించారు. కాగా..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. జనసేన పార్టీ.. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది.కానీ టీడీపీ పార్టీ.. తెలంగాణ పోటీలోనే లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version