TTD: ఇవాళ్టి నుంచి తిరుపతి ఎయిర్‌ పోర్టులో శ్రీవారి టికెట్లు

-

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ్టి నుంచి తిరుపతి ఎయిర్‌ పోర్టులో తిరుమల శ్రీవారి టికెట్లు లభించనున్నాయి. ఇవాళ్టి నుంచి తిరుపతి విమానశ్రయంలో శ్రీవాణి టికెట్ల కౌంటర్ పున: ప్రారంభం కానుందని టీటీడీ ప్రకటన చేసింది. దీంతో రోజుకి 100 శ్రీవాణి టికెట్లు ఆఫ్ లైన్ విధానంలో కేటాయింపు చేయనున్నారు టీటీడీ పాలక మండలి అధికారులు.

Srivari tickets at Tirupati Airport from today

బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులుకు మాత్రమే విమానశ్రయంలో టికెట్లు కేటాయింపులు ఉంటాయని టీటీడీ పాలక మండలి తెలిపింది. కాగా.. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 05 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 60, 110 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 21, 445 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version