Vizag: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు..!

-

విశాఖలో హై అలర్ట్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు…నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరి ఉండగా, మరో ఇండిపెంట్ అభ్యర్థి కూడా నామినేషన్‌ వేశారు. అటు టీడీపీ తుది నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.

The deadline for nominations for the MLC election will end today

ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందు పరిచారు బొత్స…2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93 లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు చూపించారు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. అటు ఇప్పటికే బెంగుళూర్ టూర్ లో అరకు, పాడేరు నియోజకవర్గాల MPTC, ZPTC లు ఉన్నారు. ఈ నెల 16 నుంచి కార్పొరేటర్లు, మిగిలిన ఓటర్లు విహార యాత్రలు షెడ్యుల్ ఖరారు అయింది.. బాలి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు GVMC కార్పొరేటర్లు. ఇటు టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరు అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version