చంద్రబాబు సిఎం అయితే ధవళేశ్వరం దగ్గర 100 మందిని చంపేసేవాడు – విజయసాయి

-

చంద్రబాబుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సిఎం అయితే ధవళేశ్వరం దగ్గర 100 మందిని చంపేసేవాడంటూ ఫైర్ అయ్యారు విజయసాయి. అవునులే చంద్రం నువ్వు సీఎంగా ఉంటే గోదారికి మోకాలడ్డంపెట్టి వరదలను ఆపేసే వాడివి లేదా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర షూటింగ్ చేసి వందమందిని చంపేసేవాడివన్నారు.

15 కోట్ల లగ్జరీ బస్సు వేసుకొచ్చి సహాయ చర్యలకైనా అడ్డం పడేవాడివి. ఈ డ్రామాలేవీ లేకుండా సాయం అందుతుంటే పచ్చ మీడియాకు కడుపుమంటే అంటూ ట్వీట్ చేశారు విజయసాయి. మంగళగిరిలో పార్టీ ఆఫీసు కట్టిన కాంట్రాక్టర్లకు 21 కోట్లు ఎగ్గొట్టిన తెలుగు దొంగల పార్టీ. బిల్లులు చెల్లించలేదని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు. నోటీసులు ఇచ్చినా జాప్యం చేయడంతో వివాదం పరిష్కారానికి రిటైర్డ్ జస్టిస్ స్వరూప్ రెడ్డిని నియమించిన హైకోర్టు!అంటూ మరో ట్వీట్ లో రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version