Breaking : 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

-

Breaking : 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ బీఏసీ సమావేశంలో ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలను చర్చించటానికి కూడా అంగీకరించింది ప్రభుత్వం. 5 రోజుల పాటు సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని.. ఈరోజు, రేపు, 19,20,21 వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు.

టీడీపీ 19 అంశాల పై, వైసీపీ 27 అంశాల పై చర్చించాలని స్పీకర్ ను కోరారని.. ప్రతిపక్షం ఏ అంశం మీద చర్చకు కోరినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని.. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. ఈరోజు కూడా సభ మొదలు కాగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని… సభను అడ్డుకోవద్దని స్పీకర్ ప్రతిపక్ష పార్టీ నేతలను సభలోనూ,బీఏసీలో కోరారన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో విఫలమయ్యాడు.. మమ్మల్ని అడగడానికి ప్రతిపక్షాలకు అంశాలేవీ లేని పరిస్థితి ఉందని చెప్పారు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version