కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటీ

-

బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని ‘ హోటల్ గేట్ వే’ లో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు కుమార స్వామితో భేటీ కావడం రాజకీయ పక్షాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమ, ప్రతిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారు.

భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలీకాప్టర్ లో చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version