ఏపీలో దారుణం.. విద్యుత్ షాక్‌తో సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి!

-

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. మెట్టగూడెంలో ఏఎస్సై తిరునావక్ అరసు‌ తన బృందంలో కలిసి కూంబింగ్ వెళ్లగా అక్కడ విద్యుత్ వైర్లు తగలడంతో షాక్ కొట్టి తిరునావక్ అరసు‌ అక్కడికక్కడే మృతి చెందారు. జంతువుల కోసం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.

రాత్రి సమయం కావడంతో చీకట్లో విద్యుత్ వైర్లు కనిపించలేదు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాళ్లకు వైర్లు తగిలి తమిళనాడు చెందిన ఏఎస్సై తిరునావక్ అరసు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు..ఏఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.జంతువుల వేట కోసం విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version