బండి సంజయ్ జోకర్ లా మారాడు – పొన్నం ప్రభాకర్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో జోకర్లా మారాడని అన్నారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నాయకులతో కలిసి ఆయన మన దీక్ష చేపట్టారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు పంజాబ్ రైతులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతులపై లేదన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో ఎన్నికల ప్రచారంలో అన్న మాటలు తప్పుపడుతూ ఇన్నేళ్ల తర్వాత శిక్ష వేసి చట్టసభకు అర్హత లేని విధంగా చూడాలనే కుట్ర కనిపిస్తుంది అన్నారు. బిజెపి పన్నిన ఈ కుట్రను దేశ ప్రజలకు గుర్తించాలని కోరారు. మోడీ ని అంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version