నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులొచ్చాయి !

-

నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్ అన్నారు. నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా ,నిరుద్యోగుల ఓట్ల కోసమే ప్రకటన అని విమర్శించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓట్లకోసం  నోటిఫికేషన్ డ్రామా కు తెర లేపాడని అన్నారు. బీజేపీ ఆందోళనను ముందే పసిగట్టిన కేసిఆర్ భయపడి నోటిఫికేషన్ అని ప్రకటన చేశారని నిజంగా నిరుద్యోగుల సమస్యల పై చిత్తశుద్ది ఉంటే అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి  చేతులు దులుపుకోవాలని చూస్తే నిరుద్యోగుల తడాఖా చూపిస్తాం జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.

దుబ్బాక ,GHMC దెబ్బతో దొరకి 6 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా..? నిరుద్యోగుల కాళ్లుకడిగి నెత్తిన పోసుకున్నా నిన్ను క్షమించరు గుర్తుపెట్టుకో….! అని ఆయన ఘాటుగా స్పందించారు. మీ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందన్న ఆయన ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నిరుద్యోగులు గుర్తు రావడానికి 6 ఏళ్ల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాటలను సీరియస్ గా తీసుకోవడం జనాలు ఎప్పుడో మానేశారన్న ఆయన కేసిఆర్ నోటిఫికేషన్ అనగానే సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నంత జోక్ గా నిరుద్యోగులు పరిగణిస్తున్నారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version