కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సింగపూర్ లో కోట్లల్లో బెట్టింగ్ !

-

రెండు రోజుల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రము అయిన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలను ఎన్నికల సంఘం రేపు ఉదయం నుండి ఓట్ల లెక్కింపును చేపట్టి , రేపు సాయంత్రానికి ఫలితాలను విడుదల చేస్తారు. కాగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల అభ్యర్థులు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ ఫలితాల కోసం ఎంతగానో వేచిచూస్తున్నారు. కాగా ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ అంటూ కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ గెలవనుందని దాదాపుగా డిసైడ్ చేసిందని చెప్పాలి. ఇక కొన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అంటున్నాయి. ఇంతలో ఒక ఆసక్తికర విషయం గెలుగులోకి వచ్చింది.

ఈ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయంట. అది కూడా సింగపూర్ కేంద్రంగా కోట్లరూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మరి రేపు ప్రకటించనున్న ఫలితాలలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version