నగరంలో మొత్తం 68 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ శ్మశానాలకు మృతదేహాలను తరలిస్తున్నారు. బీసెంట్ నగర్, వెలంగోడు, అరుంబాక్కం, విల్లివాక్కం తదితర శ్మశానవాటికల్లో ఒక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలోపే మృతదేహం వస్తోంది. మరికొన్ని శ్మశానవాటికల్లో టోకెన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్మశాన వాటికలను 24 గంటల పాటు తెరిచివుంచాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న శ్మశానవాటికల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలంటున్నారు. ఈ వినతులపై చెన్నై నగర పాలక సంస్థ అధికారులు స్పందించారు. ఈ సమస్య పరిష్కారానికి కొంతమంది అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనుంది.