బ్రేకింగ్: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు కరోనా

-

ఐపిఎల్ కోసం దుబాయ్ వెళ్ళిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇప్పుడు కరోన కలకలం మొదలయింది. చెన్నై జట్టుకి చెందిన కొంత మంది ఆటగాళ్ళు సహా సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు అని, జాతీయ అంతర్జాతీయ మీడియా తమ కథనాల్లో పేర్కొన్నాయి. సూపర్ కింగ్స్ ఆగస్టు 21 న దుబాయ్ చేరుకుంది. అప్పటికే ఐపిఎల్ నిర్దేశించిన ఆరు రోజుల నిర్బంధ వ్యవధిలో ఉంది .

అధికారులతో సహా మొత్తం సిఎస్‌కె స్క్వాడ్ శుక్రవారం తమ నాలుగవ కోవిడ్ -19 పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. వారి కరోనా క్వారంటైన్ ని సెప్టెంబర్ 1 వరకు పెంచింది ఐపిఎల్. ఆటగాళ్ళు సహా వారితో ఉన్న భార్యలు అందరికి కూడా కరోనా పరిక్షలు నిర్వహించవచ్చు. వచ్చే నెల 17 నుంచి ఐపిఎల్ మొదలు కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version