బ్రేకింగ్:విమాన ప్రమాదంలో 40 మందికి కరోనా పాజిటివ్…!

-

కేరళ రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. దుబాయ్ నుంచి ఇండియా వచ్చిన ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. కోజీ కోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్ వే పై క్రాష్ కావడంతో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. విమానం ముందు భాగంలో ఉన్న వారె ఎక్కువగా ప్రాణాలు కోల్పోగా కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

coronavirus

ఇదిలా ఉంటే ఎయిరిండియా ఫ్లైట్‌క్రాష్‌లోని 40 మంది ప్రయాణికులు కోవిడ్ 19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారు అందరికి రాత్రి నుంచి కరోనా పరిక్షలు చేయగా 191 మందిలో 40 మందికి పాజిటివ్ గా రావడంతో సహాయక చర్యల్లో పాల్గొన్న వారు అందరూ ఇప్పుడు హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని అధికారులు కోరారు. మిగిలిన వారికి సంబంధించి కరోనా ఫలితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version