Breaking: పీవీ సింధుకు గోల్డ్ మెడల్

-

బర్మింగ్ హం వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. నేటితో ( ఆగస్టు 8) ఈ మహాసంగ్రామం ముగియనుంది. 11వ రోజు మహిళల బ్యాట్మెంటన్ సింగిల్స్ లో పీవీ సింధు గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఉమెన్స్ సింగిల్స్ బ్యాట్మెంటన్ విభాగంలో ఫైనల్ లో ప్రత్యర్థి కెనడాకు చెందిన షేట్లర్ మిచెల్లి పై విజయం సాధించింది.

లీ పై 21- 15, 21 – 13 వరుస సెట్లలో ఘన విజయం సాధించింది.ఇప్పటికే రెండుసార్లు ఒలంపిక్ కాంస్య పతాక విజేత పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యా లతో మొత్తం 56 పథకాలు చేరాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version