గుడ్ న్యూస్ : ఈ సాయంత్రం నుండే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ?

-

తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి నేటితో తెర పడే అవకాశముంది. మరో సారి ఈ రోజు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. దాదాపు చర్చలు సానుకూలంగా ఉండే సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ పంపిన అన్ని ప్రతిపాదనలకు ఏపీ అంగీకరించింది. ఆ లెక్కన హైదరాబాద్ బెజవాడ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ సర్వీసులు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపేందుకు తెలంగాణ రెడీ అయింది.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో MOU ఒప్పందం జరగవచ్చని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రోజు సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడిచే ఛాన్స్ ఉంది. నిజానికి కరోనా లాక్ డౌన్ మొదలవక ముందు అంటే జనతా కర్ఫ్యూ నుండి ఈ బస్సులు కూడా ఆగిపోయాయి. అయితే లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చినా తెలంగాణా మాత్రం బస్సులు నడిపేందుకు ఒప్పుకోలేదు. ఏపీ ఆర్టీసీ వలన తాము నష్టపోతున్నాం అనేది తెలంగాణా వాదన.

Read more RELATED
Recommended to you

Exit mobile version