పిల్ల కాలువ తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రా : చంద్రబాబు

-

మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్ లు విసిరారు. సెటైర్లతో విమర్శలు చేశారు. మంత్రులు ఉదయం లేచింది మొదలు నన్ను తిట్టటమేపనిగా ఉంటారు. వారికి ఓ నోట్ వస్తుంది. ఆ నోట్ ను చక్కగా చదివేస్తారు. ఇక ఆరోజుకు వారి పని కంప్లీట్ అయినట్లే అంటూ విమర్శించారు. అక్రమ మైనింగ్ చేసేవారు మైనింగ్ మంత్రి, సొంత ఊరులో పిల్లకాలువ కూడా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి అంటూ హేళన చేశారు.

ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందిస్తామని, సంపదను సృష్టించడానికి పీ-4 నమూనా తీసుకువస్తామని, ప్రతి పేదవాణ్ని ధనికుణ్ని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలుంటాయని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి రైతుబజారును కూడా తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, విద్యాశాఖ మంత్రి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని, వైసీపీలో మొత్తం జోకర్లే ఉన్నారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version