నేడు తిరుపతి, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన

-

ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. సాయంత్రం తిరుపతికి వెళ్ళనున్నారు వైయస్ జగన్, సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, సాయంత్రం 5:15 కు తుమ్మలగుంట చేరుకోనున్నారు. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

cm jagan

తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో అరగంట పాటు గడపనున్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు తుమ్మలగుంట నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన, 6:15కి రేణిగుంట నుంచి గన్నవరం బయలుదేరనున్నారు. ఇక, ఇవాళ ఉదయం నంద్యాల జిల్లాకు వెళ్ళనున్నారు సీఎం వైఎస్ జగన్, జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ధర్మారెడ్డి కుమారుడి మృతితో దుఃఖసాగరంలో పారుమంచాల మునిగిపోయింది. గుండెపోటుతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version