తారకరత్న మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

-

నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటని అన్నారు. చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version