సిరిసిల్ల,వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలో నూతన ఎస్పీ కార్యాలయం సీఎం  ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు . అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

మహా శివరాత్రి సందర్భంగా రేవంత్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పరిశాలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విద్య, వైద్యం, రోడ్లు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ,ముంపు గ్రామాలలో ఉపాధి కోసం పరిశ్రమలను స్థాపిస్తామని తెలిపారు.జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version