బ్రేకింగ్; తెలంగాణాలో మరో 13 కరోనా కేసులు …!

-

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 30, 40 కేసులు నమోదు అయిన రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణాలో 13 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల్ జిల్లాల్లో నమోదు అవుతున్నాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకోగా, 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సిఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలునిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version