ఆస్పత్రి పార్కింగ్ లో రేప్ చేసారు: మరీ దారుణ ఘటన…!

-

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో రోహిణి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు, ఇద్దరు మాజీ బౌన్సర్లు ఉన్నారు. అక్టోబర్ 30-31 అక్టోబర్ మధ్యలో ఈ ఘటన జరిగింది. రోహిణిలోని బాబా సాహిబ్ భీమ్ రావు అంబేద్కర్ హాస్పిటల్ పార్కింగ్ ప్రాంతంలో తనను రేప్ చేసారు అని 30 ఏళ్ళ మహిళ… ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ రోహిణి ఆసుపత్రిలో చేరిన వారిని పరామర్శించడానికి వచ్చింది అని…ఆ  తర్వాత ఆమెను రేప్ చేసారు అని, ఆసుపత్రి మాజీ బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డు మహిళను బెదిరించారని, ఆమెను చెక్ చేయడానికి ఆసుపత్రి పార్కింగ్‌లోని ఎవరూ లేని స్థలానికి తీసుకుని వెళ్ళారు అని అధికారులు తెలిపారు. ఆమె ఫిర్యాదు తరువాత, ముగ్గురు నిందితులను పోలీసులు అక్టోబర్ 31 న అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news