Breaking : హైదరాబాద్‌లో నడిరోడ్డుపై అతికిరాతకంగా కత్తులతో హత్య..

-

హైదరాబాద్‌ జగద్గిరి గుట్ట ఆర్పీ కాలనీలో నడిరోడ్డుపై దారుణ హత్య కలకలం రేపుతోంది. వెంటాడి కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు.
ఈ హత్యకు కారణం అక్రమ సంబందం కారణమా లేక సెటిల్‌మెంట్‌ గొడవలా అనేది తేలాల్సిఉంది. హత్యకు గురైన వ్యక్తిని ఫయాజ్‌గా గుర్తించారు. ప్రశాంత్‌, సాయి, టిల్లు, సురేష్‌ ఇంకా కొందరు కలిసి ఈ హత్య చేసినట్టు తెలిసింది.

అయితే హత్య చేసిన వారందరు కూడా ఫయాజ్‌కి స్నేహితులే అనేది తెలియవచ్చింది. గతకొంతకాలంగా రెండు గ్రూపులుగా విడిపోయిన వీరిమద్య గ్యాంగ్‌ వార్‌ నడుస్తున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా ఆవారాగా తిరుగుతూ సెటిమెంట్లు చేసేవారని, గత నాలుగు రోజులుగా వీరి మద్య గొడవలు జరుగుతున్నాయని స్థానికుల ద్వారా తెలిసింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నదాన్ని బట్టి పదిమందిదాకా ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందుతులను గుర్తించామని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news