రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని వరుడి పాడు పని…. బాలికపై అత్యాచారం

-

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మరో రెండు  రోజుల్లో పెళ్లి పెట్టుకుని వరుడు పాడు పనికి పాల్పడ్డాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా… 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనకు పాల్పడింది బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్న ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిని ఆదిత్య ధన్ రాజ్ నరేష్ శాహూగా(28) గుర్తించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు 

ఎయిర్ ఫోర్స్ లో కార్పొరల్ గా పనిచేస్తున్న నిందితుడు…మే 12న అతని వివాహం ఉండగా సొంతూరుకు వచ్చాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా.. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు… ఎవరితో అయిన ఈ ఘటన గురించి చెబితే చంపేస్తానంటూ బాధిత బాలికను బెదిరించాడు. కాగా తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది బాలిక. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు వివాహం చేసుకునే అమ్మాయిది వేరే రాష్ట్రం. పెళ్లి కోసం నాగ్ పూర్ చేరుకున్న యువతి కుటుంబీకులకు ఈ విషయం గురించి తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news