ప్రేమను వద్దన్నారని తల్లి, తమ్ముడ్ని చంపిన మహిళా టెకీ…!

-

తన ప్రేమను ఒప్పుకోలేదని ఒక మహిళా టెకీ తన తల్లిని చంపి, సోదరుడిని పొడిచి చంపేసింది. దీనితో ఆమెను, ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేసారు. ది బెంగళూరు మిర్రర్ నివేదిక ప్రకారం ఏమి జరిగిందంటే… ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ టెక్కీ తన తల్లి (54) ను హత్య చేసి, తన సోదరుడిని కత్తితో పొడిచి చంపింది. తాను తప్పు చేశా అని భావించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఆమె సోదరుడు అంతకు ముందు తన సోదరి వింత ప్రవర్తన గురించి పలువురికి చెప్పాడు. లక్షలు అప్పు చేసిందని వింతగా ప్రవర్తిస్తుంది అంటూ వివరించాడు. ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేసిన పోలీసులు… అసలు కారణం అది కాదని గుర్తించారు. ఆమె హత్య చేసిన తర్వాత అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లోని ఒక హోటల్‌ కి వెళ్లిపోయింది.

బెంగళూరు పోలీసులు సీసీ టీవీ ఫూటేజి ద్వారా ఆమెను ఒక బైక్ మీద స్నేహితుడితో కలిసి వెళ్తున్నట్టు గుర్తించారు. ఆమె ఎక్కడికి వెళ్లిందో గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ప్రేమకు తల్లి, సోదరుడు ఒప్పుకోలేదని అందుకే హతమార్చింది అని… వారం క్రితమే వాళ్ళు టికెట్ లు కూడా కొనుగోలు చేసి అక్కడికి వెళ్లిపోయారని గుర్తించారు పోలీసులు. వారిని గురువారం కర్ణాటక తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news