మాజీ మంత్రి దేవినేని ఇంట తీవ్ర విషాదం..

-

ఏపీ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవినేని ఉమా తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ మరణించారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో… గుండెపోటు రావడం కారణంగా… దేవినేని శ్రీమన్నారాయణ మృతి చెందారు. దేవినేని శ్రీమన్నారాయణ వయస్సు 89 సంవత్సరాలు. కంకిపాడు మండలం నేను పల్లి అనే గ్రామంలో శ్రీమన్నారాయణ జన్మించారు.

ఆ తరువాత కంచికచర్లలో వారు స్థిరపడ్డారు. మొదటినుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీమన్నారాయణ మృతికి పలువురు టిడిపి నాయకులు, దేవినేని ఉమా బంధువులు సంతాపం తెలిపారు. శ్రీమన్నారాయణ మరణవార్త విన్న దేవినేని అవినాష్… విజయవాడలోని ఆ ఆస్పత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. ఒక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా… దేవినేని ఉమా ను పరామర్శించారు. ఇది ఇలా ఉండగా… దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని స్వగ్రామానికిి కాసేపటి క్రితమే తీసుకువెళ్లారు… ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version