ధనుష్ వాళ్ళ కొడుకే.. తేల్చి చెప్పేసిన కోర్టు..!

-

టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి కోర్టులో ఉరట లభించింది. కొంతకాలంగా కదిరేసన్ మీనాక్షి జంట ధనుష్ మా కొడుకే అని న్యాయ పోరాటం చేస్తున్నారు 2016లో మధురై మేలురు కోర్టులో ఈ కేసు నమోదయింది సినిమాలు మీద ఆసక్తితో ధనుష్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడని ఎప్పటినుండో వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు దొరికాడని అన్నారు తాము జీవించడానికి నెలకి 65000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ధనుష్ మాత్రం వారు తమ అమ్మ నాన్న కాదని తల్లిదండ్రులు కస్తూరి రాజా విజయలక్ష్మి అని తన నుండి డబ్బు రాబట్టడానికి కేసు పెట్టారని ధనుష్ చెప్తూ వచ్చారు.

9 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూ ఉంది తాజాగా కోర్టు కేసును కొట్టేసింది. మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కావని తేల్చి చెప్పింది కోర్టు. గతంలో వారు కోర్టుకి అందించిన పిటిషన్ లో ధనుష్ కి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల గురించి రాయడంతో ధనుష్ ని చెక్ చేయడానికి కోర్టు అనుమతించింది. అతని ఒంటిమీద వాళ్లు చెప్పినట్లుగా ఎటువంటి పుట్టుమచ్చలు లేవని తెలిపారు. దీంతో కోర్టు ధనుష్ కస్తూరి రాజా విజయలక్ష్మిల కొడుకేనని తీర్పునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version