కేటీఆర్ కి అశోక్ నగర్ వెళ్లే దమ్ముందా..? కాంగ్రెస్ సవాల్..!

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు రోడ్డు షోలో పాల్గొని బీఆర్ఎస్ ప్రజలకు మద్దతు పలికారు. ఇవాళ కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ ఫేమస్ నీలోఫర్ కేఫ్ కి వెళ్లి.. సాధారణ పౌరుడిలా అక్కడ ఛాయ్ తాగి అక్కడున్న ప్రజలతో ముచ్చటించారు. ఫోటోలు దిగి సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్టు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పాతబస్తీలోని ఫేమస్ ఐస్ క్రీమ్ సెంటర్, మదీనా లోని షాదాబ్ రెస్టారెంట్ కి ఎలాంటి హడావిడి లేకుండానే విత్ ఔట్ ప్రోటోకాల్ ఆయన రెస్టారెంట్ కి వెళ్లి బిర్యాని ఆర్డర్ ఇచ్చి తిన్నారు. ఆయన డిన్నర్ చేస్తూనే అక్కడికీ వచ్చిన వారిని ఆన పలుకరించారు. దీంతో ఆ హోటల్ వద్ద పెద్ద ఎత్తున జనం గుంపులుగా గూడీ సెల్ఫీకోసం ఎగబడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. హైదరాబాద్ లో అశోక్ నగర్ కి వెళ్లే దమ్ముందా కేటీఆర్ అంటూ.. కాంగ్రెస్ సవాల్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version