తెరాస ఎమ్మెల్యే రియాక్షన్ కు ఫిదా…!

-

తెరాస ఎమ్మెల్యే అరికేపూడి గాంధి పెద్ద మనసు చాటుకున్నారు. గాయపడిన యువకులను గాంధీ తన కారులో ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పర్వత్ నగర్ జుంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢి కొట్టింది శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాన్వాయ్ లోని వాహనం. ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఎమ్మెల్యే వాహనంలోనే ఇద్దరు యువకులను హాస్పిటల్ కు తరలించారు సిబ్బంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వస్తున్న ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కారు ఈ ప్రమాదానికి కారణం అయింది. రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమే కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదంటుని మాదాపూర్ పోలీసులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version