నంది అవార్డుల జాప్యం పై స్పందించిన సినీ రచయిత విజయేంద్రప్రసాద్

-

నంది అవార్డుల జాప్యంపై స్పందించారు ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్. తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా నంది అవార్డులు ఇవ్వాలన్నారు విజయేంద్రప్రసాద్. అవార్డుల ద్వారా రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాలన్నారు. తెలంగాణను కొత్తగా చూపించే చిత్రాలకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని.. సినిమా మాద్యమం చాలా శక్తివంతమైనదన్నారు.

తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలున్నాయన్నారు. 90 శాతం సినిమా స్థానికంగా చేస్తే రాయితీలతోపాటు అవార్డులు ఇవ్వాలన్నారు. సినిమా చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. బాలీవుడ్ చిత్రం వల్ల స్విట్జర్లాండ్ లో భారత పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version