కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం – బూర నర్సయ్య గౌడ్‌

-

నాకు టీఆర్ఎస్ లో ఘోర అవమానం జరిగిందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే.. పార్టీ సభ్యత్వానికి టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. తనకు ఘోర అవమానం జరిగిందని.. అందుకే రాజీనామా చేశానని ఈ లేఖలో పేర్కొన్నారు.

అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ వెల్లడించారు. నేను వ్యక్తిగతం అవమాన పడ్డాను, నాకు సమాచారం ఇవ్వకుండానే మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంపై దిక్కార స్వరం వినిపించారు. ఆత్మ గౌరవ సభలకు ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వలేదని ఆగ్రహించారు. తెలంగాణలో బీసీలకు వివక్ష జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version