ఉమ్మడి ప్రాజెక్టలను కేంద్రం చేతిలో పెడితే.. తెలంగాణ అడుక్కోవాలి: హరీష్ రావు

-

కేంద్రం చేతిలో కనుక ఉమ్మడి ప్రాజెక్టులను పెడితే తెలంగాణ అడుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు ఉమ్మడి ప్రాజెక్టులు అప్పజెప్పడానికి తెలంగాణ సర్కార్ ఒప్పుకుందని అంటున్నారు అని మండిపడ్డారు హరీష్ రావు. ఒకవేళ అదే నిజం కనుక అయిందంటే తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పారు అప్పట్లో KCR ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్ట్ లని అప్పగించడానికి బిఆర్ఎస్ సర్కారు ఒప్పుకోలేదని చెప్పారు హరీష్ రావు.

ఉమ్మడి ప్రాజెక్ట్ లో అప్పగింతపై కేంద్రం ఏపీ సర్కార్ నుండి ఒత్తిడి వచ్చేదని కూడా చెప్పారు ఉమ్మడి ప్రాజెక్టులు ఏకపక్షంగా అప్పజెప్పడానికి తాము ఒప్పుకోమని కేసీఆర్ సర్కార్ తేల్చి చెప్పిందని హరీష్ రావు చెప్పారు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించాలని అంటే కొన్ని షరతులు KCR ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిందని కూడా హరీష్ రావు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సర్కార్ ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించడానికి రెడీ అవుతుందని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version