పీయూష్‌ గోయల్‌.. ఎనిమిది ఏళ్లుగా ఏమి పీకుతున్నావ్..?: హరీష్‌ రావు

-

తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ ప్రజలను అవమనపరిచేలా ఇవాళ మాట్లాడారని.. పీయూష్ గోయల్ కు వక్రీకరణలు అలవాటుగా మారిందని నిప్పులు చెరిగారు. పీయూష్ గోయల్ కు అర్థం కావడం లేదు…వ్యవసాయం చేస్తే రైతు సమస్యలు ఏమిటో ఆయనకు తెలిసేదని.. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ లో రైతుల కోసం టిఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ రైతుల సమస్యను పీయూష్ గోయల్ అర్థం కావడం లేదని… తెలంగాణ రైతులకు పియిష్ గోయల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులను అవమాణిస్తే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పీయూష్ గోయల్ కామెంట్స్ ను టిఆర్ఎస్ ఖండిస్తుంది…మరి బిజెపి రాష్ట్ర నాయకుల వైఖరి ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటి అయిన మేల్కొనాలని.. లేకపోతే రైతుల కోపాగ్నిలో బిజెపి నేతలు మసీ అవుతారని హెచ్చరించారు. కేంద్రం బేషరతుగా వడ్లు కొనాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version