అత్యాచారం కేసుపై స్పందించిన కృష్ణుడు..!

-

తనపై 139 మంది అత్యాచారం జరిపారని, మొత్తం ఐదువేలసార్లు తనపై రేప్‌ జరిగిందని ఓ యువతి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి.. గత కొంత కాలంగా తనపై అత్యాచారాలు జరుగుతున్నాయని పోలీసులను ఆశ్రయించింది. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు.

ఆమె చెప్పిన లిస్టులో చాలామంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే ఈ కేసు విషయమై నటుడు కృష్ణుడు స్పందించాడు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధంలేదని, ఈ కేసు ఫాల్స్‌ కేసుగానే తాను భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి ఆరోపణ వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో మానసిక క్షోభకు గురయ్యారన్నారు. పోలీసులు ఈ కేసులో నిజా నిజాలను వెలికి తీస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version