నాకు పెళ్లంటూ జరిగితే అక్క‌డే అంటున్న హీరోయిన్ త్రిష‌..!

-

హీరోయిన్ త్రిషకు తెలుగులో విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఆమెకు మొదట తెలుగులోనే మంచి అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కృష్ణ, స్టాలిన్, నమో వేంకటేశ.. పలు సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన త్రిష.. కొన్నేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉంది. అయితే దక్షిణాదిన తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా తమిళ సినిమాలే చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన హీరోయిన్ త్రిష, తనకు ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.

తనకు కూడా కొన్ని కలలు ఉన్నాయని పేర్కొంది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తనకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్ లోనే చేసుకుంటానని, అదే తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని వెల్లడించింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న `పొన్నియిన్‌ సెల్వన్‌`, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం, మోహన్‌ లాల్‌ తో `రామ్‌` సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, మరిన్ని సినిమాలను ఫైనలైజ్ చేసే పనిలో ప‌డింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version