టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు..

-

‘నకిలీ మెయిల్ ఐడీ’ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి కోర్టుకు ఈమేరకు హైకోర్టు ఆదేశాలు పంపింది. టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఆయనపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి.

ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్స్‌ గ్రూప్‌ అధ్యక్షుడు టి.కృష్ణప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కూకట్ పల్లి కోర్టులో పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version