బ్రేకింగ్ : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద నేషనల్ హైవే మీద ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారు తీవ్ర గాయాల పాలయ్యారు. అందుతున్న సమాచారం మేరకు మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను ముందు ఒక టిప్పర్‌ ఢీకొట్టింది, దీంతో ఆ ఆటో ఓ కారును ఢీకొట్టింది.

దీంతో ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయాలైన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news