హైదరాబాద్ వ్యక్తి మీద అమెరికాలో కాల్పులు.. పరిస్థితి విషమం

-

అమెరికాలో మరో హైదరాబాద్ వాసి పై కాల్పులు కలకలం రేగింది. హైదరాబాద్ పాత బస్తీ యకుత్ పురకు చెందిన  43 ఏళ్ల ముజీబుద్దిన్ పై కాల్పులు జరిగాయి. బాధితున్ని యూనివర్సిటీ ఆఫ్ షికాగో హాస్పిటల్ కి తరలించినట్టుగా చెబుతున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని  కేంద్రానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన మొహ‌మ్మ‌ద్ ముజుబుద్దీన్ ను దొపిడీ దొంగ‌లు కాల్చినట్టుగా భావిస్తున్నారు.

కారులో వ‌స్తుండ‌గా తుపాకీ చూపి కారు ఆపిన న‌ ల్ల‌జాతీయులు, కారు దింపి ప‌ర్సు న‌గ‌దు లాక్కున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దోపిడీ  దుండ‌గులు, ముజీబుద్దిన్ మధ్య పెనుగులాట‌కు దారి తీసినట్టు సమాచారం. కారు లాక్కెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా ప్ర‌తిఘ‌టించిన ము‌జుబుద్దీన్‌ను న‌ల్ల‌ జాతీయులు తుపాకీతో  కాల్చి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ముజీబ్ ప‌రిస్థితి విష‌మంగా ఉందని అంటున్నారు. ప్ర‌స్తుతం ముజీబ్‌ను యూనివ‌ర్సిటీ ఆఫ్ షికాగో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇద్ద‌రు అనుమానితుల‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version