కల్తీ మద్యంపై జగన్ మాట్లాడితే నవ్వొస్తుంది : సోమిరెడ్డి

-

ఏపీలో మద్యాన్ని తక్కువ ధరలకు అమ్మేందుకు క్వాలిటీ తగ్గిస్తున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఐదేళ్ల పాలనలో మద్యం ద్వారా జగన్ మోహన్ రెడ్డి రూ.వేల కోట్లు దోచుకుంటే చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల ఆదాయం తెచ్చారని గుర్తుచేశారు.

జగన్ హయాంలో ప్రతి నెలా రూ.250 కోట్లు లోటస్‌పాండ్‌కు తరలించేవారని ఆరోపించిన సోమిరెడ్డి.. రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలకే కేజ్రీవాల్, సిసోడియా జైలుకెళ్లారని, కానీ వందల కోట్ల స్కామ్ చేసిన జగన్ బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. అందుకే ఇకనైనా మాజీ సీఎం జగన్ నీచ రాజకీయాలు ఆపాలని హితవు పలికారు. కాగా, ఏపీ సర్కార్ కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల బాధ్యతను అప్పగించగా.. సోషల్ మీడియా వేదికగ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version