ఇండియాలో కొత్తగా 10,197 కరోనా కేసులు… 527 రోజుల తర్వాత ఇదే తొలిసారి !

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న పదివేలకు దిగువ లో నమోదైన కరోనా మహమ్మారి కేసులు… ఇవాళ పదివేలకు పైగా నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇండియా వ్యాప్తంగా కొత్తగా… 10, 197 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

అలాగే గడచిన 24 గంటల్లో 301 మరణాలు నమోదుకాగా… 12 ,134 మంది కరోనా నుంచి కోలుకునీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య… 1,28,555 గా నమోదు అయింది. ఇంత తక్కువ యాక్టివ్ కేసుల సంఖ్య నమోదు కావడం 527 రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 113.68 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లను వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 62 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,73,890 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version