ఆలస్యం ప్రారంభమైన కీలక మ్యాచ్‌.. ఓవర్లు కుదింపు

-

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న ఇండియా-సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పిచ్‌ను కవర్స్‌తో కప్పేశారు. అనంతరం వర్షం మరింత పెద్దదయింది. ఈ కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.

వర్షం ఆగిపోయినా కూడా అవుట్ ఫీల్డ్‌ను సూపర్ సోకర్స్‌తో మ్యాచ్‌కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించినట్లు బీసీసీఐ తెలిపింది. అలాగే 7.50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఒక ఇన్నింగ్స్ పూర్తవగానే ఇచ్చే ఇన్నింగ్స్ బ్రేక్‌ను కూడా 10 నిమిషాలకు కుదించినట్లు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version