మోదీ హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఆసక్తికర ఘటన..కాన్వాయ్ ఆపి..!

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాటి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ జనానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ.. ఓ చోట ఉన్నట్టుండి తన కాన్వాయ్ ని ఆపారు. ఆ తర్వాత కారులో నుంచి దిగిన మోదీ.. ఆ జన సమూహం లో భారీకేడ్లకు ఆవల నిలిచిన ఓ బాలిక వద్దకు వెళ్లారు.

 

ఆ బాలిక చేతిలోని పెయింటింగ్ ను తీసుకున్నారు. భారీకేడ్లకు ఆవలే నిలుచుండి మరీ మోడీ కాళ్లకు ఆ బాలిక నమస్కరిస్తే.. మోదీ ఆ బాలికను ఆశీర్వదించారు. ఇంతకీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవరిదో తెలుసా.? మోదీ మాతృమూర్తిది. కాన్వాయ్ లో స్పీడుగా వెళుతున్న మోడీ.. తన తల్లి పెయింటింగ్ చూడగానే తన కాన్వాయ్ ని నిలిపి వేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version