ఇథియోపియాలో జరిగిన ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు…!

-

సెక్యూరిటీ పరంగా సెయింట్ మేరీ చర్చి చాలా సురక్షితం. కానీ వచ్చిన రిపోర్టు ప్రకారం ఏకంగా ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మేరీస్ చర్చి చుట్టూ ఎనిమిది వందల మందిని చంపేశారు. దీనితో ఇక్కడ ప్రాంతం అంతా కూడా శవాల తో నిండి పోయింది. కొన్ని రోజుల పాటు ఆ వీధులన్నీ అలానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితుల పట్ల విశ్వవిద్యాలయం లెక్చరర్ మాట్లాడడం జరిగింది. గీత మార్క్ ఏమన్నారంటే తుపాకీ పేలిన శబ్దం ఎప్పుడైతే వినపడిందో అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు చర్చి వైపు పరుగులు తీశారు. వాళ్లు అక్కడ ఉన్న ప్రీస్ట్స్ కి సహాయం చేయాలని అనుకున్నారు.

ఇలా చాలా మంది ప్రాణాలు వదిలేశారు. ఇది నవంబర్ నెల లో జరిగింది. ఆ సందర్భంలో ఇథియోపియా పీఎం అభి అహ్మద్ ఇంటర్నెట్ ని మరియు మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్ ని నిలిపివేశారు. దీంతో ఇథియోపియా లో ఉన్న ప్రజలు మిగిలిన దేశాల వారికి సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అని ఆమె చెప్పడం జరిగింది. అక్కడ ప్రజలకు ఇలా జరగడంతో మిగిలిన వారిని కూడా భయాందోళన చెందారు. ఇలా పాల్పడిన వాళ్లకి అసలు భయం లేదు అని ఆమె చెప్పడం జరిగింది.

ఇథియోపియాని 27 ఏళ్ల పాటు థిగారే పీపుల్స్ లిబరేషన్ వాళ్లు పరిపాలించడం జరిగింది. కానీ ఇథియోపియాలో థిగారే వాళ్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నారు. వాళ్లే మిగిలిన వాళ్ళని డామినేట్ చేసి పరిపాలించే వాళ్ళు. దీంతో వ్యాపారులు సైతం అందరు ఇబ్బంది పడ్డారు. ఇలాంటివి సంభవించడం కారణంగా థిగారే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ TPLP వాళ్ళ యొక్క ఇమేజ్ ని కోల్పోయారు.

దానితో 2018వ సంవత్సరంలో అహ్మద్ పవర్ లోకి రావడం జరిగింది. ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ అభి అహ్మద్ ఆర్మీకి ఆర్డర్లు పంపారు. ఆర్మీ వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ ఎటాక్ అయిపోయిన తర్వాత ఆర్మీ క్యాంప్ లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. దీనిని పక్కన పెడితే థిగారే తాలూకా మెయిన్ పొలిటికల్ పార్టీ వాళ్లు ఆర్మీ నార్తెన్ కమాండ్ ని తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ ఈ ఎక్విప్మెంట్ ని స్వాధీనం చేసుకుని ఆ సైనికులు అరెస్టు చేశారు. ఇలా అక్కడ కరోనా ఉన్న సమయంలో సివిల్ వార్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news