IPL 2023 :పృథ్వీ షా మళ్ళీ విఫలం… ఇక పక్కన పెడితే బెటర్ !

-

ఐపీఎల్ లో వరుసగా మూడవ మ్యాచ్ లో యువ సంచలనం గా పేరు తెచ్చుకున్న పృథ్వీ షా కేవలం 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న పృథ్వీ షా ఓపెనర్ గా వస్తున్నాడు. సీజన్ ఆరంభంలో మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ ఓపెనీర్ పృథ్వీ షా కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగారు..

తాజాగా ఈ రోజు ముంబై తో జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి మూడు పోర్ల సహాయంతో 15 పరుగులు మాత్రమే చేసి షోకీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వరుసగా విఫలం అవుతున్న పృథ్వీ షా ను కొన్ని మ్యాచ్ లు పక్కన పెట్టి మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version