పాదయాత్రలో ఒక్క రైతన్నా ఉన్నాడా? – అంబటి రాంబాబు

-

అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పాదయాత్రలో ఒక్క రైతన్నా ఉన్నాడా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి స్కామ్ కు పునాది వేసింది చంద్రబాబు అని విమర్శించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు, రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర అని ఆరోపించారు.

ఎన్ని పాదయాత్రలు చేసినా మూడు ప్రాంతాలు మెచ్చుకోవాలని.. ఆరోజు తెలంగాణలో విభేదాలు రాలేదా? అన్నారు. ఇక్కడ కూడా అమరావతి లోనే అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమనుకుంటారని.. అందుకే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పిదం కారణంగానే పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. దమ్ముంటే పోలవరం పై చర్చించడానికి అసెంబ్లీకి రావాలని అంబటి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version