జానారెడ్డి వారసులు రెడీ అయ్యారు..రేవంత్ సెట్ చేస్తారా?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో జానారెడ్డి వారసుల దూకుడు పెరిగింది..ఇంతకాలం తండ్రికు వెనుక ఉంటూ పనిచేస్తూ వచ్చిన రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు ఇప్పుడు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తాను ఇంకా పోటీ చేయనని జానారెడ్డి చెప్పారో అప్పటినుంచే ఆయన వారసులు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. అసలు ఉపఎన్నికలోనే జానారెడ్డి వారసుడు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది గాని, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జానారెడ్డినే డైరక్ట్‌గా బరిలో దిగాలని కోరడంతో, జానారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం జానారెడ్డి పోటీ చేయడం కష్టమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు వయసు మీద పడింది..కాబట్టి యాక్టివ్‌గా ప్రజల్లో తిరగకపోవచ్చు. అందుకే ఆయన పోటీ నుంచి తప్పుకుని, తన తనయులని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు వారసులు నల్గొండ జిల్లాలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఇటీవల ఇద్దరు నేతలు….ఒకరి తర్వాత ఒకరు వరుసపెట్టి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ సీట్లు గురించే అని తెలుస్తోంది.

ప్రస్తుతం జానారెడ్డి ఫ్యామిలీ చేతిలో ఒక సీటు మాత్రమే ఉంది. అది కూడా నాగార్జున సాగర్ మాత్రమే. అంటే ఇద్దరు వారసుల్లో ఒకరికి మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో జానారెడ్డి తన మరో వారసుడుకు మిర్యాలగూడ సీటుని కూడా లైన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అక్కడ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేశారు.

పైగా మిర్యాలగూడలో రఘువీర్ రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం, పార్టీ కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్‌లో జయవీర్ రెడ్డి పనిచేస్తున్నారు. అంటే రెండు సీట్లలో పోటీకి జానారెడ్డి వారసులు రెడీ అయిపోయారు. మరి వారికి రేవంత్ సీట్లు ఫిక్స్ చేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version