కరోనా నిధుల కోసం.. నగ్న చిత్రాన్ని వేలం వేయనున్న నటి..!

-

ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ కరోనా బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు గాను ఆమె 25 ఏళ్ల కిందట తీసిన తన ఫొటోను వేలం వేయనుంది. 1995, నవంబర్‌లో మార్క్‌ సెలిగర్‌ అనబడే ఓ ఫొటోగ్రాఫర్‌ ఈ నటి నగ్న చిత్రాన్ని కెమెరాలో బంధించాడు. కాగా ఇప్పుడదే చిత్రాన్ని వేలం వేయనున్నారు. ఈ మేరకు జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఓ పోస్టులో ఈ విషయాన్ని తెలియజేసింది.

కోవిడ్‌ 19 నిధుల కోసం తన ఫ్రెండ్‌, ఫొటోగ్రాఫర్‌ మార్క్‌ సెలిగర్‌ 25 ఫొటోలను వేలం వేస్తున్నాడని, అందులో తన ఫొటో కూడా ఒకటి ఉందని జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ తెలిపింది. ఆ ఫొటో అమ్మకం ద్వారా వచ్చే నిధులను తాను తీసుకోనని, ఆ మొత్తాన్ని ఎన్‌ఏఎఫ్‌ క్లినిక్స్‌కు అందజేస్తానని తెలిపింది. ఇక ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నానని ఆమె తెలిపింది.

కాగా జెన్నిఫర్‌ ఆనిస్టన్‌తో కలిపి మొత్తం 25 మంది సెలబ్రిటీల పాత ఫొటోలను వేలం వేసి కోవిడ్‌ 19 నిధులు సేకరించనున్నారు. ఆ ఫొటోల్లో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో, ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే వంటి ప్రముఖుల ఫొటోలు కూడా ఉండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version