America : వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు.. దీపం వెలిగించిన బైడెన్

-

అగ్రరాజ్యం అధ్యక్షుడి నివాస భవనం వైట్ హౌస్‌ చరిత్రలో మొట్టమొదటి సారిగా అట్టహాసంగా దీపావళి వేడుకలు జరిగాయి. బైడెన్‌ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్‌లు ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీపాలు వెలిగించి వేడుకల్లో పాల్గొన్నారు.

‘‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు చాలా మది ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్‌ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరంగా భావిస్తున్నాను’’ అని బైడెన్ అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘శ్వేత సౌధం ఒక ప్రజాసౌధం. ఇక్కడ అన్ని జాతుల వారు.. అధ్యక్షుడు, తొలి మహిళతో కలిసి వారి పండుగలను నిర్వహించుకోవచ్చు. 100 కోట్ల మంది ప్రజలతో కలిసి బైడెన్‌ కార్యవర్గం కూడా దీపం వెలిగించి చెడుపై మంచి, అజ్ఞానంపై విజ్ఞానం, చీకటిపై వెలుతురు జరిపే పోరాటంలో భాగమైంది’’ అని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version