పీపీఈ కిట్లు తో కౌన్ బనేగా కరోడ్​పతి షో…!

-

ఇటీవలే కరోనా బారిన పడ్డ బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. అలా కోలుకున్నారో లేదో షూటింగ్​ పనుల్లో బిజీ అయిపోయారు. సోమవారం ప్రముఖ టెలివిజన్​ క్విజ్​ గేమ్​ షో ‘కౌన్ బనేగా కరోడ్​పతి’ చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సెట్స్​కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ.. “పీపీఈ కిట్లు ధరించి తిరిగి పని ప్రారంభించా. 2000 సంవత్సరంలో మొదలైన ఈ గేమ్​ షోకు ఇప్పుడు 20 ఏళ్లు. చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అమితాబ్​ రాసుకొచ్చారు.దేశవ్యాప్తంగా కేబీసీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12వ ఎడిషన్ నిర్మాణ దశలో ఉంది.

కరోనా తో కోలుకున్న తర్వాత ఎంతో వేగంగా అమితాబ్ షో చెయ్యడానికి సిద్దం అయ్యారు.. కుటుంబ సభ్యులు అందరూ కరోనాతో కోలుకోవాలని అభిమానులందరూ పూజలు చేశారు. ఆ మధ్య అమితాబ్ చని పోవాలంటే ఓ వ్యక్తి ట్వీట్ చెయ్యడం పెద్ద దుమారం లేపింది. ఇప్పుడు అమితాబ్ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version