నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర..!

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో నేడు జన ఆశీర్వాద యాత్రను చేయబోతున్నారు. యాత్ర లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొంటారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతరం కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభిస్తారు. భువనగిరి లో కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యం పంపిణీ కేంద్రం ను కిషన్ రెడ్డి సందర్శిస్తారు.

అలాగే ఘట్ కేసర్ వద్ద కేంద్రమంత్రి కి మేడ్చల్ జిల్లా బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బిజెపి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల వరకు జన ఆశీర్వాద యాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఏడు గంటలకు బిజెపి కార్యాలయం వద్ద కిషన్ రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version