చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం : కొడాలి నాని

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దశమగ్రహమంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను గద్దె దించడానికి చంద్రబాబు జీవితం సరిపోదన్నారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్ళే, దండలు వేయడం ఉన్మాదమేనన్నారు కొడాలి నాని. 2019లోనే ప్రజలు టీడీపీకి సమాధి కట్టినా.. ఇంకా రాష్ట్రాన్ని జలగలా పట్టుకున్నారని కొడాలి నాని మండిపడ్డారు. అమలాపురం విధ్వంసం.. బాబు, నిక్కర్ల పార్టీ బ్యాచ్ పన్నాగమేమని ఆరోపించారు కొడాలి నాని. బాబు దృష్టిలో ఆ నలుగురే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలన్న నాని.. ఎన్టీఆర్ పార్టీ లాక్కొన్ని ఆయన్ను బయటకు గెంటేశాడని మండిపడ్డారు కొడాలి నాని.

మహానాడు పేరుతో, శత జయంతి ఉత్సవాల పేరుతో పార్టీలో మిగిలి ఉన్న నాయకులు, కార్యకర్తల్ని నమ్మించటానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు చంద్రబాబును, టీడీపీని వెళ్ళగొట్టినా.. ఆయనకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదన్నారు. జగన్ ను అధికారం నుంచి దించడం మీ తరంకాకే, ఆ పార్టీలు, ఈ పార్టీలు కలిసి రావాలని అడుక్కునే చంద్రబాబు మా పార్టీని ఓడిస్తాడా..? అని ఛాలెంజ్ చేశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version